13
1k
174
కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్..
ఫోనీ తుఫాను లైవ్ అప్ డేట్స్..
కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్..
గుజరాత్ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో వుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ ఇదే స్థితిని కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ కు 89 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. బీజేపీకి 79 చోట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో పోరు ఏకపక్షంగా సాగుతోంది. బీజేపీ 21 స్థానాల్లో, కాంగ్రెస్ 22స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. గుజరాత్లో 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 92 సీట్లు హిమాచల్లో 68 స్థానాలకు 337 మంది అభ్యర్థుల పోటీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 35 సీట్లు
ఇకపై తాను మాట్లాడే ప్రతి మాట సామజిక మాధ్యమాల్లో ఉంటుందని వైసీపీ అధినేత వైయస్ జగన్ చెప్పారు.. ఫేస్బుక్లో విడుదల చేసిన తొలి వీడియోలో జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘తెలుగు ప్రజలకు నమస్కారం.. ఇది వరకు ప్రకటించిన విధంగా ప్రజా సంకల్ప యాత్రను నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాను. వైఎస్సార్ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో ఒక్కటయ్యారు. భాగమయ్యారు. మీరు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7 నెలలపాటు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో మీకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతి అంశాన్నీ వింటాను. మీ కష్టాలను, నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను. నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. ఆ నవరత్నాలను కూడా మెరుగు పరచడానికి మీరేదైనా సలహా ఇస్తే తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను. మనం ఎన్నికల సమయానికి విడుదల చేసే మేనిఫెస్టో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోలా కాకుండా ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలి. నా పాదయాత్ర ద్వారా నేను చేసే ప్రయత్నమిదే. ఆ దిశగా మీ సలహాలు, మీరు చెప్పే అంశాలతో, మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయాలన్న తాపత్రయంతోనే నా పాదయాత్ర సాగుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా’’ అని జగన్ అభిమానులనుద్దేశించి ఫేస్బుక్ ద్వారా ప్రసంగించారు..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి భవనాల చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో సమావేశాలు జరిగేందుకు మూడువేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటుచేశారు. అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు చుట్టూ నాలుగు కిలోమీటర్ల పొడవునా ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించరాదని ఆ ఉత్తర్వుల్లో కమిషనర్ స్పష్టంచేశారు.
టిటీడీపీ అత్యవసర సమావేశానికి హాజరయిన రేవంత్ రెడ్డి
గణేష్ నిమజ్జనం లైవ్ అప్ డేట్స్