తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి భవనాల చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో సమావేశాలు జరిగేందుకు మూడువేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటుచేశారు. అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు చుట్టూ నాలుగు కిలోమీటర్ల పొడవునా ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించరాదని ఆ ఉత్తర్వుల్లో కమిషనర్ స్పష్టంచేశారు.