వైయస్ జగన్ పాదయాత్ర లైవ్ అప్ డేట్స్..

ఇకపై తాను మాట్లాడే ప్రతి మాట సామజిక మాధ్యమాల్లో ఉంటుందని వైసీపీ అధినేత వైయస్ జగన్ చెప్పారు.. ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన తొలి వీడియోలో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘తెలుగు ప్రజలకు నమస్కారం.. ఇది వరకు ప్రకటించిన విధంగా ప్రజా సంకల్ప యాత్రను నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాను. వైఎస్సార్‌ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో ఒక్కటయ్యారు. భాగమయ్యారు. మీరు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7 నెలలపాటు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో మీకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతి అంశాన్నీ వింటాను. మీ కష్టాలను, నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను. నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. ఆ నవరత్నాలను కూడా మెరుగు పరచడానికి మీరేదైనా సలహా ఇస్తే తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను. మనం ఎన్నికల సమయానికి విడుదల చేసే మేనిఫెస్టో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోలా కాకుండా ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలి. నా పాదయాత్ర ద్వారా నేను చేసే ప్రయత్నమిదే. ఆ దిశగా మీ సలహాలు, మీరు చెప్పే అంశాలతో, మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయాలన్న తాపత్రయంతోనే నా పాదయాత్ర సాగుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా’’ అని జగన్ అభిమానులనుద్దేశించి ఫేస్బుక్ ద్వారా ప్రసంగించారు..

avatar hmtv